
చింతలపూడి లో బాడీ బిల్డింగ్ పోటీల
ఏలూరు జిల్లాచింతలపూడి పట్టణం లో స్థానిక ఫైర్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన
ఎంఆర్,ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు మరియు చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు,
శారీరక సౌష్టవం తో మంచి ఆరోగ్యం లభిస్తుంది అని చింతలపూడి శాసనసభ్యులు పేర్కొన్నారు,
చింతలపూడిలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మిస్టర్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు శాస్త్రీయ బద్దంగా ఆహారం తీసుకోవడం ద్వారా శారీరక పరిపుష్ఠ కలిగి ఈ విధంగా కృషి చేయడం అభినందనలు గ్రామీణ ప్రాంతంలో ఈ విధమైనటువంటి క్రీడోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని యువత ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు,
ప్రజలు అందరూ ఉదయకాల నడక, వ్యాయామం యోగ చేయటం లాంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు,
ఇంతకుముందు 2% ఉన్న ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాన్ని ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం 3% పెంచడం హర్షనియమని పేర్కొన్నారు,
ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ గారు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరాయ్యగారు, టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి చంద్ర శేషు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.