ताज़ा ख़बरें

పేదలకు వైద్యసేవలే లక్ష్యం

పేదలకు వైద్యసేవలే లక్ష్యం

పేదలకు వైద్యసేవలే లక్ష్యం

 

* నిరుపేదల ఆరోగ్యమే ధ్యేయం

* అనాధలు, పేదలకు ఉచిత వైద్య సేవలు

* సామాన్యులకు సబ్సిడీపై సేవ

* తిరివీధి లక్ష్మీరామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

* ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరివీధి కృష్ణ స్పష్టం

 

ఏలూరు జిల్లా. పరిధిలోగల

నూజివీడు పట్టణంలోని మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరివీధి కృష్ణ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి ట్రస్ట్ తరఫున ఉచిత పరీక్షలు, మందులు అందించటం జరుగుతుందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సబ్సిడీపై కళ్లజోళ్ళు, శస్త్ర చికిత్సలు అందిస్తామన్నారు. నిరుపేదలు, నాధలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అనాధలకు వైద్య సేవలను చేరువ చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. అందుకోసం ప్రణాళికా బద్ధంగా గ్రామ గ్రామాన, ఈ వార్డులో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక రచించి ఒక క్రమ పద్ధతిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వైద్య శిబిరాల ఏర్పాటుకు సహకరిస్తున్న మిత్రులు, అయోభిలాషులు, కొందరు దాతృత్వం ప్రదర్శిస్తున్న దాతల సహకారం ఎన్నటికీ మరువలేనిది అన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Show More
Back to top button
error: Content is protected !!